తమిళనాడును కలవరపెడుతున్న కరోనా

By - Admin |24 Aug 2020 9:48 PM IST
తమిళనాడులో కరోనా కలవరం పెడుతుంది. గత కొన్ని రోజుల నుంచి ప్రతీ రోజు ఐదువేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
తమిళనాడులో కరోనా కలవరం పెడుతుంది. గత కొన్ని రోజుల నుంచి ప్రతీ రోజు ఐదువేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,967 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 97 మంది మరణించారని తమిళనాడు ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 3,85,352కు చేరింది. అటు, కరోనా మృతుల సంఖ్య 6,614కు చేరింది. తమిళనాడులో కరోనా నుంచి ఇప్పటివరకూ 3,25,456 మంది కోలుకోగా.. ఇంకా 53,282 చికిత్స పొందుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com