KGF: 5 సీక్వెళ్లు.. కానీ, యశ్ తో కాదంట....

KGF: 5 సీక్వెళ్లు.. కానీ, యశ్ తో కాదంట....
కేజీఎఫ్ కు ఐదు సీక్వెళ్లు; జేమ్స్ బాండ్ సిరీస్ మాదిరి కథను నడిపించనున్న ప్రశాంత్ నీల్....

కేజీఏఫ్ సినిమా గురించి చిన్న అప్ డేట్ వచ్చినా చాలు ప్రేక్షకులు సంబరపడిపోతున్నారు. రెండు భాగాలూ పాన్ ఇండియా రేంజ్ లో కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అయితే కేజీఎఫ్ 2 ముగింపు ప్రశ్నార్థకంగా ఉండటంతో 3వ భాగం ఖచ్చితంగా ఉంటుందని సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. అయితే వారి ముచ్చట తీర్చేందుగా అన్నట్లు డైరెక్టర్స్ టీమ్ నుంచి మంచి కబరు వచ్చింది.


కేజీఎఫ్ పార్ట్ 3 మాత్రమే కాదు మొత్తం 5 భాగాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ ను కూడా సిద్ధం చేస్తున్నాడట. జేమ్స్ బాండ్ సిరీస్ తరహాలో కేజీఎఫ్ ను రూపొందించాలని హోంబాలే ఫిల్మ్ భావిస్తోందట. అయితే ప్రతి పార్ట్ లోనూ వేరే హీరోలు ఉంటారని హోంబాలే బ్యానర్ వ్యవస్థాపకుడు విజయ్ కిర్గాండోర్ స్పష్టం చేశాడు.


అయితే కేజీఎఫ్ 3లో యశ్ మాత్రమే హీరో అని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ లోనూ యశ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కేజీఎఫ్, సలార్ కథల నడుమ ఓ లింక్ కూడా ఉండబోతోందని వినిపిస్తోంది. ఏమైనా కేజీఎఫ్ 3 మాత్రం 2025లో రీలీజ్ కు రెడీ అవుతోందని చిత్ర బృందం తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story