Vande Bharat : రేపు మరో 10 కొత్త వందే భారత్ రైళ్లు

Vande Bharat : రేపు మరో 10 కొత్త వందే భారత్ రైళ్లు
X

దేశంలో మరికొన్ని కొత్త వందే భారత్ రైళ్లును రైల్వే శాఖ ప్రవేశపెట్టనుంది. సెప్టెంబర్ 15న ఒకేసారి 10 వందేభారత్ రైళ్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ ప్రారంభిస్తారు. అంతకు ముందు ఆగస్టు 31న ప్రధాన మంత్రి ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, కర్నాట కలో మూడు కొత్త వందేభారత్ రైళ్లను ప్రారంభించారు.

సెప్టెంబర్ 15న టాటా నగర్- పాట్నా, రాంచీ- గొడ్డ, ఆగ్రా- వారణా సి, హుబ్లీ- పూణే, నాగపూర్- సికింద్రాబాద్ రూట్లు ఉన్నాయి. కొత్త రైళ్ల ప్రారంభంతో మహారాష్ట్ర నుంచి 8 వందే భారత్ రైళ్లు నడుస్తాయి. కొత్త రైళ్లలో ఆధునిక సదుపాయలను పెంచారు. భద్రతకు అధిక ప్రాధాన్య త ఇచ్చారు. ఇందులో రైళ్లు ఢీకొనకుండా నిరోధించే రక్షణ వ్యవస్థ కవచ్ ను ఉపయోగించారు.

Tags

Next Story