Jharkhand : పెండ్లికి వెళ్లొస్తుండగా ప్రమాదం 9 మంది మృతి

X
By - Manikanta |21 Jun 2025 4:45 PM IST
పశ్చిమ బెంగాల్లో ఘోర రో డ్డుప్రమాదం జరిగింది. బొలేరో వాహనం ట్రక్కును ఢీకొట్టడంతో 9 మంది చనిపోయారు. పురులియా జిల్లా నామోల్ సమీపం లోని జాతీయ రహదారి 18పై ఈ ఘటన చోటుచేసుకుంది. బారాబజార్ పోలీస్ స్టేషన్ పరిధి అడబానా గ్రామానికి చెందిన పలువురు జార్ఖండ్ లోని నిమిహ్ ప్రాంతంలో తిలైతాండ్లో జరుగుతున్నఓ పెండ్లికి బొలెరో వాహనంలో వెళ్లారు. కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తుండగా.. వీరు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి ట్రక్కును బలంగా ఢీకొట్టింది. దీంతో బొలెరో వాహనంలోని 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే వారు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com