Udaipur: నుపుర్ శర్మకు మద్దతుగా పోస్ట్.. నడిరోడ్డుపై తల నరికి హత్య.. ఆపై వీడియో తీసి..
Udaipur: రాజస్థాన్లోని ఉదయ్పూర్ మాల్డాస్ స్ట్రీట్లో దారుణం జరిగింది. నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ను షేర్ చేసిన వ్యక్తిని ఇద్దరు ఆగంతకులు దారుణంగా హతమార్చారు. కత్తులతో దాడిచేస్తూ.. వ్యక్తి తల నరికి చంపారు. దారుణానికి పాల్పడిన అనంతరం దుండగులు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ చర్యను గొప్పగా చెప్పుకుంటూ కత్తిచూపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
అటు హత్య ఘటనతో ఉదయ్పూర్లో ఒక్కసారిగా ఉద్రిక్తత తలెత్తింది. దారుణ ఘటనను నిరసిస్తూ మాల్డాస్ స్ట్రీట్లో నిరసనకు దిగారు. వ్యాపారులు షాప్లు మూసివేసి బంద్ పాటించారు. హత్య ఘటనతో అప్రమత్తమైన పోలీసులు కట్టు దిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. అదనంగా 600 మంది భద్రతా సిబ్బందిని ఉదయ్పూర్లో మోహరించారు. అటు ఇంటర్నెట్ సేవల్ని అధికారులు నిలిపి వేశారు. నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com