Rahul Gandhi : అగ్ని వీర్ యువత బొటన వేలు తెంచారు

Rahul Gandhi : అగ్ని వీర్ యువత బొటన వేలు తెంచారు
X

మహాభారతంలో ద్రోణుడి మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం కూడా యువత బొటన వేలిని కత్తిరిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సమాన రాజకీయ ప్రాతిని ధ్యం లభించాలన్నదే తమ అభిమతమని, అందుకే కులగణనలో కొత్త బాటలు వేస్తామని 50శాతం రిజర్వేషన్ అనే గోడను బద్దలు కొడతామని రాహుల్ గాంధీ అన్నారు. జనాభా ప్రాతిపదికన అందరికీ అన్ని సామాజిక వర్గాలకు అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ఇవాళ రాజ్యాంగం పై చర్చ సందర్భంగా లోక్ సభలో ఆయన ఉద్వేగభరితం గా ప్రసంగించారు. మనుస్మృతికి రాజ్యాగానికి ఉన్న తేడాను వివరించారు. ఎందరో మహాను భావుల ఆలోచనలో రూపుదిద్దుకున్నదే రాజ్యాం గమని చెప్పారు. రాజ్యాంగం కోసం ఇండియా కూటమి పనిచేస్తుందని తెలిపారు. రాజ్యాంగా న్ని తెరిస్తే.. అంబేద్కర్, గాంధీ, నెహ్రూల ఆకాం క్షలు, ఆలోచనలు మనకు కనిపిస్తాయన్నారు. ఎన్డీఏ పాలనలో ఆర్థిక, సామాజిక సమానత్వా లు లేకుండా పోయాయని అన్నారు. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన కులాలు, రైతులు, శ్రా మికుల బొటన వేళ్లు ఎవరు కత్తిరిస్తున్నారో చూ పించాలనుకున్నామని చెప్తూ మహాభారతంలోని ద్రోణాచార్యుడి పాత్రను గుర్తు చేశారు. అప్పటి కుల వివక్షను ప్రస్తావించారు. 'ఏకలవ్యుడు ద్రో ణాచార్యుడి దగ్గరకు విలువిద్య నేర్పమని వెళ్లాడు. నువ్వు మా జాతివాడివి కాదని ఏకలవ్యుడ్ని వెనక్కి పంపాడు. ద్రోణుడి ప్రతిరూపంతో ఏకలవ్యుడు విలువిద్య నేర్చుకున్నాడు. ద్రోణుడు కోరితే తన బొటనవేలును గురుదక్షిణగా ఇచ్చాడు.’అని అన్నారు. చెప్పారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 70 పేపర్ లీకేజీ ఘటనలు చోటు చేసుకున్నాయ నిఅన్నారు. కనీస మద్దతు ధర కోసం నిరసన తెలి పేందుకు ఢిల్లీ వస్తున్న రైతులపై టియర్ గ్యాస్ ప్ర యోగించారని, అదానీ, అంబానీలను అందలం ఎక్కిస్తున్న మీరు రైతుల బొటన వేలు తెంపేశారం టూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభయ ముద్రతో కాంగ్రెస్ పార్టీ భరోసా ఇస్తే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం బొటన వేళ్లను తెంచేస్తోందని అన్నారు. ఇదే ఎన్డీఏ, ఇండియా కూటమికి మధ్య ఉన్న తేడా అని పేర్కొన్నారు. మీరు ఎక్కడికి వెళ్లినా.. ఒక మతంతో మరొక మతానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని వెదజల్లుతారని, అలా వ్యవహరిం చాలని రాజ్యాంగంలో ఎక్కడుందో చూపాలని డిమాండ్ చేశారు. సావర్కర్ గురించి ప్రశ్నిస్తే తనను దోషిగా చూస్తున్నారని అన్నారు. అనేక మంది మేధావుల లోచనలకు ప్రతిరూపం మన రాజ్యాంగమని దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని చెప్పారు

Tags

Next Story