Train Accident : మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన 8 బోగీలు

అస్సాంలో మరో రైలు ఘటన చోటుచేసుకుంది. అగర్తల-లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ 8 కోచ్లు పట్టాలు తప్పాయి. బోగీలు చెల్లాచెదురుగా పడ్డాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వేశాఖ తెలిపింది. గురువారం ఉదయం అగర్తల నుంచి ముంబైకి వెళ్లే లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 3:55 గంటలకు అస్సాంలోని డిబాలాంగ్ స్టేషన్ దగ్గర పట్టాలు తప్పిందని రైల్వే శాఖ తెలిపింది. లండింగ్ డివిజన్ పరిధిలోని లుమ్డింగ్-బర్దర్పూర్ హిల్ సెక్షన్లో ఈ ప్రమాదం జరిగింది. పవర్ కార్, రైలు ఇంజిన్తో సహా ఎనిమిది కోచ్లు పట్టాలు తప్పినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరికీ కూడా పెద్దగా గాయాలు కాలేదని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రైల్వే అధికారులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై అన్వేషిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com