Ayodhya: అయోధ్య ఆలయంలో పూజారి హత్య..

Ayodhya: అయోధ్య ఆలయంలో పూజారి  హత్య..
ప్రఖ్యాత హనుమాన్ గర్హి ఆలయంలో ఘటన, శిష్యులే ?

అయోధ్యలోని హనుమాన్‌గర్హి ఆలయంలో దారుణం చోటు చేసుకుంది. 44ఏళ్ల పూజారి గురువారం రామజన్మభూమి ప్రాంగణంలోని హై-సెక్యూరిటీ జోన్‌లోని ఒక గదిలో గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. తన ఇద్దరు శిష్యులతో కలిసి ఆలయానికి పక్కనే ఉన్న గదిలో ఆయన ఉంటున్నారు. ఎవరో తెలిసిన వారు అతన్ని హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

రామ జన్మభూమి ప్రాంగణంలోని హై సెక్యూరిటీ జోన్ లో ఉన్న ప్రఖ్యాత హనుమార్ గర్హి ఓ గదిలో రామ్ సహరే విగత జీవిగా కనిపించారు. పూజారిని గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆయనను గొంతు కోసం హత్య చేసినట్టు గుర్తించారు. బాగా తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదయం 7 గంటలకు ఈ దారుణం జరిగినట్టు సమాచారం అందుకున్న పోలీసులు దుండగులు పదునైన ఆయుధంతో దాడి చేశారని తెలిపారు. పూజలు నిర్వహించడానికి రామ్ సహరే రాకపోవడంతో తోటి పూజారులు వెళ్లి ఆయన కోసం వెతుకుతుండగా ఆయన మృతదేహం కనిపించింది. నిన్న రాత్రి పూజారికి, ఆయన శిష్యులకు మధ్య ఘర్షణ జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

పూజారి శిష్యులే ఈ హత్య చేసి ఉండొచ్చనే ఆరోపణలు వినిపిస్తుండటంతో వారిలో ఒకరిని పట్టుకుని పోలీసులు విచారిస్తున్నారు. మరో శిష్యుడు పరారయ్యాడు. అతన్ని పట్టుకోవడం కోసం నాలుగు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story