Bharat Bandh : భారత్ బంద్ ఎఫెక్ట్ .. ఏజెన్సీలో హై అలర్ట్

ఆపరేషన్ కగార్ పేరుతో ప్రభుత్వం మావోయిస్టులపై చేస్తోన్న ఆపరేషన్ కు వ్యతిరేకంగా మావోయిస్ట్ పార్టీ భారత్ బంద్ కు పిలుపు నిచ్చింది. నంబాల కేశవరావు సహా మావోయిస్టులు అగ్రనాయకుల ఎన్ కౌంటర్లను నిరసిస్తూ ఇవాళ దేశ వ్యాప్త బంద్కు మావోయిస్టులు పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో ఏవోబీలో హై అలర్ట్ ప్రకటించారు. ప్రత్యేక బలగాలు ముమ్మంగా కూంబింగ్ చేస్తూ ఏవోబీని జల్లెడ పడుతున్నాయి. ఏజెన్సీలో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. బంద్ నేపథ్యంలో అధికారుల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసుల నిలిపివేశారు. విశాఖ,భద్రాచలం నైట్ సర్వీసులు కూడా నిలిపివేశారు. సరిహద్దు గ్రామాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సరిహద్దు ల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపటి నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు స్మారక సభలు నిర్వహించనున్నట్టు మావో యిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది. ఈ క్రమంలో ఏపీ - ఒడిశా - తెలంగాణ - చత్తీస్గఢ్ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com