Railways : బిగ్ షాక్..త్వరలో రైలు చార్జీల పెంపు?

త్వరలోనే రైలు చార్జీలు పెరగబోతున్నాయని తెలుస్తోంది. జులై 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. నాన్ ఏసీ మెయిల్/ ఎక్స్ప్రెస్ ట్రైన్ టికెట్ ధర కిలోమీటర్ కు 1 పైసా, ఏసీ తరగతి టికెట్ ధర కిలోమీటరుకు 2 పైసలు చొప్పున పెరగను న్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సబర్బన్ టికెట్ ధరలు, 500 కిలోమీటర్ల వరకు సెకండ్ క్లాస్ ప్రయాణాని కి ఈ పెంపు వర్తించదని తెలుస్తోంది. 500 కిలోమీటర్లు దాటితే కిలోమీటరుకు ఒక పైసా చొప్పున చెల్లించాల్సి ఉంటుందని, తత్కాల్ టికెట్కు సంబంధించి రైల్వే శాఖ ఇటీవలే కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆధార్ అథంటికేషన్ ఉన్న వారికి తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. జులై 1 నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది. అదే రోజు నుంచి టికెట్ ధరల పెంపు కూడా అమల్లోకి రానున్నట్లు రైల్వే వర్గాలు పే ర్కొన్నాయి. నెలవారీ సీజన్ టికెట్ ధరల్లోనూ ఎలాంటి మార్పూ ఉండబోదని తెలుస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com