Union Minister : బ్లాక్ బాక్స్ ను విదేశాలకు పంపలేదు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన దుర్ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు ఈ విమానంలో అసలేం జరిగిందో తె లుసుకోనేందుకు అందరి దృష్టీ ఇప్పుడు 'బ్లాక్ బాక్స్' పై పడింది. ఈ నేపథ్యంలో బ్లాక్బాక్స్న విచారణ కోసం విదేశాలకు పంపించారంటూ జరుగుతోన్న ప్రచారాన్ని కేంద్ర విమానయా నశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తోసిపు చ్చారు. అవన్నీ కేవలం ఊహాగానాలేనన్నారు. ఇవాళ పుణెలో జరిగిన హెలికాఫ్టర్స్ అండ్ స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ సమ్మిట్ 2025 సందర్భం గా ఆయన మీడియాతో మాట్లాడారు. బ్లాక్ బాక్స్ను విదేశాలకు పంపిస్తున్నారా? అని విలేకర్లు అడగ్గా.. “అవన్నీ కేవలం ఊహాగానాలే. బ్లాక్బాక్స్ భారత్లోనే ఉంది. దీన్ని ప్ర స్తుతం ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో పరిశీలిస్తోంది” అన్నారు. ఎప్పటివరకు దీంట్లోని డేటాను పొందొచ్చని మరో ప్రశ్నకు ఇది చాలా సాంకేతికతతో కూడిన వ్యవహారము ని, ఏఏఐబీ దర్యాప్తు చేపట్టి మొత్తం ప్రక్రియను పరిశీలించి ఇస్తుందని చెప్పారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com