Maharashtra: పెళ్లిని మర్చిపోయి వరుడి పార్టీ.. వధువు తండ్రి చేసిన పనికి షాక్..

Maharashtra: పెళ్లిని మర్చిపోయి వరుడి పార్టీ.. వధువు తండ్రి చేసిన పనికి షాక్..
Maharashtra: వధువు తండ్రితో కూడా ఆ వరుడు దురుసుగా ప్రవర్తించాడు.

Maharashtra: ఎంత మతిమరుపు ఉన్న మనిషి అయినా సొంత పెళ్లిని మర్చిపోతారా..? కానీ ఈ వ్యక్తి మాత్రం తన ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌మెంట్ మత్తులో పడి తన పెళ్లి అన్న విషయమే మర్చిపోయాడు. ఏకంగా నాలుగు గంటలు పెళ్లి మండపానికి లేటుగా వచ్చాడు. అది కూడా తాగేసి వచ్చి అందరితో వాగ్వాదానికి దిగాడు. దీంతో వధువు తండ్రి తీసుకున్న నిర్ణయానికి అందరూ షాక్ అయ్యారు.

మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఇటీవల ఓ వివాహం నిశ్చమయ్యింది. సాయంత్రం 4 గంటలకు ముహూర్తం. అన్నీ అనుకున్నట్టుగానే జరిగాయి. వధువు కుటుంబం అంతా పెళ్లి మండపానికి చేరుకున్నారు. కానీ వరుడు మాత్రం ఇంకా రాలేదు. ఎంతసేపు ఎదురుచూసినా.. అతడి దగ్గర నుండి కబురు లేదు. తీరా అతడు రాత్రి 8 గంటలకు తాగేసి వచ్చి అందరితో వాగ్వాదానికి దిగాడు.

వధువు తండ్రితో కూడా ఆ వరుడు దురుసుగా ప్రవర్తించాడు. దీంతో వధువు తండ్రి తన బంధువుల అబ్బాయికి ఫోన్ చేసి పిలిపించి అదే మండపంలో తన కూతురిని అతడికి ఇచ్చి పెళ్లి చేశాడు. దీంతో వరుడికి పెద్ద షాకే తగిలింది. పెళ్లి కొడుకు తన ఫ్రెండ్స్‌తో కలిసి తాగొచ్చి అందరితో గొడవ పెట్టుకున్నాడని, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు వధువు తండ్రి తెలిపాడు.

Tags

Read MoreRead Less
Next Story