Tamil Nadu : బస్సు బోల్తా, ఇద్దరు మృతి, 21 మందికి గాయాలు

తమిళనాడులోని తిరుపూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. సెంగంపల్లి సమీపంలో కళాశాల విద్యార్థులను తీసుకెళ్తున్న ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందగా, 21 మంది గాయపడినట్లు సమాచారం. ప్రైవేట్ బస్సు కార్గో ట్రక్కును క్రాస్ చేస్తుండగా.. డ్రైవర్ అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయాడని, దీంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దురదృష్టవశాత్తు, ఈరోడ్లోని ఒక కళాశాలలో చదువుతున్న పెరియసామి, హరికృష్ణన్ ఈ ప్రమాదంలో మరణించారు, అనేక మంది విద్యార్థులు సహా 21 మంది ప్రయాణికులను చికిత్స కోసం పెరుంతురై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ గిరీష్ కుమార్ యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఉతుకులి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com