Rajya Sabha : సింఘ్వీ సీటు దగ్గర డబ్బు.. రాజ్యసభలో రచ్చ రచ్చ

Rajya Sabha : సింఘ్వీ సీటు దగ్గర డబ్బు.. రాజ్యసభలో రచ్చ రచ్చ
X

రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ సీటు వద్ద డబ్బులు కనిపించడం కలకలం రేపింది. కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సీనియర్ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీ సీటు వద్ద డబ్బులు దొరికినట్టు రాజ్యసభ చైర్మన్ ప్రకటన చేశారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. సాధారణ తనిఖీల్లో భాగంగా చెకింగ్స్ చేస్తున్నపుడు ఈ డబ్బులు సింఘ్వీ సీటుకు దగ్గర్లో పట్టుబడినట్టు తేలిందన్నారు. అయితే.. ఈ డబ్బులు ఎందుకు రాజ్యసభకు తీసుకువచ్చారు.. ఎవరికి సంబంధించినవి.. దాని వెనుక ఎవరు ఉన్నారు.. అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అభిషేక్ సింఘ్వీ సీటు వద్ద డబ్బులు దొరికినట్లు రాజ్యసభ చైర్మన్ ప్రకటించడంతో కాంగ్రెస్‌ ఎంపీలు ఆందోళనకు దిగారు.

Tags

Next Story