Corona Booster Dose: వారికి కూడా కరోనా బూస్టర్ డోస్ ఇవ్వాలనుకుంటున్న కేంద్రం..

Corona Booster Dose: వారికి కూడా కరోనా బూస్టర్ డోస్ ఇవ్వాలనుకుంటున్న కేంద్రం..
Corona Booster Dose: దేశంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ కరోనా టీకా బూస్టర్​ డోసులు అందించాలని భావిస్తోంది మోదీ సర్కారు.

Corona Booster Dose: దేశంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ కరోనా టీకా బూస్టర్​ డోసులు అందించాలని భావిస్తోంది మోదీ సర్కారు. ఇప్పటికే వృద్ధులు, ఆరోగ్య సిబ్బందికి ప్రికాషనరీ డోసుల పేరుతో మూడో డోసును కేంద్రం పంపిణీ చేస్తోంది. ప్రస్తుతం చైనా సహా పలు దేశాల్లో మళ్లీ కరోనా విజృంభిస్తుండటంతో 18 ఏళ్లు దాటిన వారికి బూస్టర్​ డోసును అందుబాటులోకి తేవాలని కేంద్రం భావిస్తోంది. అంతర్జాతీయ ప్రయాణాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం హెల్త్​కేర్​, ఫ్రంట్​లైన్​ వర్కర్లు సహా 60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ప్రికాషనరీ డోసులు అందుబాటులో ఉన్నాయి. రెండో డోసు తీసుకున్న 9 నెలల తర్వాతే బూస్టర్​ డోసు తీసుకోవాలని కేంద్రం ఇదివరకు వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 10న అర్హులైన వారికి బూస్టర్​ డోసు పంపిణీని ప్రారంభించింది. ఇప్పటికీ వరకు 2 కోట్ల ప్రికాషనరీ డోసులను పంపిణీ చేసింది.మరోవైపు 12-14 ఏళ్ల వారికి టీకా పంపిణీని మొదలుపెట్టింది కేంద్రం.

Tags

Read MoreRead Less
Next Story