Pune Metro Phase-2 : పుణె మెట్రో ఫేజ్-2కు కేంద్రం ఆమోదం

Pune Metro Phase-2 :  పుణె మెట్రో ఫేజ్-2కు కేంద్రం ఆమోదం
X

పుణెమెట్రో రైలు ఫేజ్ -2 పనులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిసింది. రూ.3,626 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నా రు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ అనంతరం మీడియాకు వెల్లడించారు. ఇక ఝురియా మాస్టర్ ప్లాను రూ.5,940.47 కోట్లు కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ఆయన చెప్పారు. ఈ నిధులతో అక్కడ మౌళిక సదుపాయాలైన రోడ్లు, విద్యుత్, నీరు సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, పాఠశాలలు, ఆస్పత్రులు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంతో పలు ఇతర పనులు చేపడుతారు. దేశంలో ఎమ ర్జెన్సీ విధించి ఇవాల్టికి సరిగ్గా యాబై ఏళ్లు పూర్తయిన సందర్భంగా నాటి అత్యవరసర పరిస్థితికి వ్యతిరేకంగా సమావేశంలో ఒక తీర్మా నాన్ని ఆమోదించారు. నాటి ఎమర్జెన్సీ బాధితులకు నివాళిగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. భారత వ్యోమగామి శుభాంశు శుక్లాతో కూడిన మిషన్ ఇవాళ అంతరిక్షంలోకి ప్రవేశించడాన్ని స్వా గతిస్తూ మరో తీర్మానం ఆమోదించారు.

Tags

Next Story