Chhatrapati Shivaji: 350 ఏళ్ల తరువాత స్వదేశానికి వచ్చిన ఛత్రపతి శివాజీ రహస్య ఆయుధం

Chhatrapati Shivaji: 350 ఏళ్ల తరువాత స్వదేశానికి వచ్చిన ఛత్రపతి శివాజీ రహస్య ఆయుధం
X
ఇప్పటి వరకు లండన్ ఆల్బర్ట్ మ్యూజియంలో ‘వాఘ్ నఖ్’

మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్‌ ఉపయోగించిన రహస్య ఆయుధం ‘వాఘ్‌ నఖ్‌’ (పులి పంజా) 350 ఏళ్ల తర్వాత భారత్‌కు చేరింది. బుల్లెట్‌ప్రూఫ్‌ కవర్‌లో, భారీ సెక్యూరిటీ మధ్య దీన్ని మహారాష్ట్ర ప్రభుత్వం భారత్‌కు తీసుకొచ్చింది. సతారా లోని ఛత్రపతి శివాజీ మ్యూజియంలో దీన్ని ఉంచారు. ఈ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే , డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ ఇతర నాయకులు తరలివచ్చారు. సతారాలో ఏడు నెలల పాటు ‘వాఘ్‌ నఖ్‌’ను ప్రదర్శనకు ఉంచనున్నారు. ఇన్నాళ్లుగా లండన్‌లోని అల్బర్ట్‌ మూజియంలో ఈ ఆయుధం ఉంది. ప్రజలకు చూపించాలని సంకల్పించిన మహారాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక ప్రాతిపదికన మూడేళ్ల పాటు ఉంచుకునేందుకు ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది.

సతారాలోని ఛత్రపతి శివాజీ మ్యూజియంలో దీన్ని ప్రదర్శనకు పెట్టారు. ఈ వేడుకకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్, ఇతర నాయకులు హాజరయ్యారు. ఏడు నెలల పాటు వాఘ్ నఖ్‌ను సందర్శకుల కోసం మ్యూజియంలో ఉంచుతారు.

చరిత్ర ..

1649లో ఛత్రపతి శివాజీ బీజాపూర్ సుల్తాన్‌ను ఓడించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించారు. అంతకుముందు బీజాపూర్ సేనాధిపతి అప్జల్ ఖాన్‌తో సమావేశమైన శివాజీ రహస్యంగా తన వద్ద దాచుకున్న వాఘ్ నఖ్‌తో అతడిని అంతమొందించాడు. ప్రతాప్‌గఢ్ కోటలో ఈ ఘటన జరగింది. ఇది ప్రస్తుతం సతారా జిల్లాల్లో ఉండటంతో ప్రభుత్వం ఈ ఆయుధాన్ని ఇక్కడి మ్యూజియంలో ప్రజల సందర్శన కోసం ఉంచింది. ఇక ఈ ఏడాది చివరిలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో శివాజీ ఆయుధం అంశం తమకు కలిసి వస్తుందని శివసేన (ఏక్‌నాథ్) శిండే వర్గం భావిస్తోంది. మరాఠా అస్తిత్వానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ ఆయుధం తమ విశ్వసనీయతను పెంచుతుందని నమ్ముతోంది.

Tags

Next Story