CM Yogi : కుంభమేళాలో తొక్కిసలాట నేపథ్యంలో సీఎం యోగీ కీలక నిర్ణయం

CM Yogi : కుంభమేళాలో తొక్కిసలాట నేపథ్యంలో సీఎం యోగీ కీలక నిర్ణయం
X

మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట నేపధ్యంలో ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మ‌హాకుంభ్‌లో వీవీఐపీ పాసుల‌ను ర‌ద్దు చేసింది. ప్ర‌యాగ్‌రాజ్ ప్రాంతాన్ని నో వెహిక‌ల్ జోన్‌గా ప్ర‌క‌టించింది. మంగ‌ళ‌వారం త్రివేణి సంగం ఘాట్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌లో 30 మంది మృతిచెందారు. ఈ నేప‌థ్యంలో యూపీ స‌ర్కార్ కీల‌క నిర్ణయాలు తీసుకుంది. మ‌హాకుంభ్ ప్రాంతంలోకి వాహ‌నాల ఎంట్రీని నిషేదించింది. వెహికిల్ ఎంట్రీ కోసం ఇచ్చే ప్ర‌త్యేక పాసుల‌కు కూడా అనుమ‌తి లేదు. వీవీఐపీ పాసుల‌ను కూడా ర‌ద్దు చేసింది. ఏ వాహనానికి మినహాయింపు ఉండదు. వ‌న్‌వే రూట్ల‌ను అమ‌లు చేస్తున్నారు. భ‌క్తులు స‌లువుగా న‌డిచేందుకు వ‌న్‌వే ట్రాఫిక్ సిస్ట‌మ్‌ను అమ‌లు చేస్తున్నారు. ప్ర‌యాగ్‌రాజ్ స‌మీప జిల్లాల నుంచి వ‌స్తున్న వాహ‌నాల‌ను ఆ జిల్లా స‌రిహ‌ద్దుల‌కే ప‌రిమితం చేయ‌నున్నారు. డిస్ట్రిక్ బోర్డ‌ర్ల వ‌ద్ద వాహ‌నాల‌ను నిలిపివేస్తున్నారు. ర‌ద్దీని త‌గ్గించే ఉద్దేశంతో ఈ చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. ఫిబ్ర‌వ‌రి 4వ తేదీ వ‌ర‌కు చాలా క‌ఠిన నిబంధ‌న‌లు పాటించ‌నున్నారు. ప్ర‌యాగ్‌రాజ్‌లోకి ఫోర్ వీల‌ర్ వాహ‌నాల ఎంట్రీని నిలిపివేశారు. కోట్ల సంఖ్య‌లో భ‌క్తులు వ‌స్తున్న నేప‌థ్యంలో.. క్రౌడ్ మేనేజ్మెంట్ వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తున్నారు.

Tags

Next Story