Congress OBC Meeting : నేడు ఢిల్లీలో కాంగ్రెస్ ఓబీసీ సమావేశం.. తెలంగాణ నేతల క్యూ

కాంగ్రెస్ పార్టీ కుల గణన సక్సెస్ క్యాంపెయిన్ పై దృష్టి సారించింది. కేంద్రంను ఒప్పించడంలో రాహుల్ గాంధీ చేసిన కృషిని ప్రసంశిస్తూనే దేశ వ్యాప్తంగా కుల గణన చేయాల్సిన విధానంపై ఎజెండాను సిద్ధం చేస్తుంది. నేడు ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో ఆల్ ఇండియా ఓబీసీ సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి దేశ వ్యాప్తంగా ఉన్న ఓబీసీ నేతలతో పాటుగా తెలంగాణకు చెందిన బీసీ లీడర్లు హాజరుకానున్నారు. తెలంగాణలో కుల గణన చేసిన విధానంపై మరోసారి చర్చించనున్నారు. ఇప్పటికే దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ కుల గణనను తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోంది.
జాతీయ నేతలకు కుల గణనపై మరోసారి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లుగా సమాచారం. అలాగే ఏఏ అంశాలను కేంద్రం ముందు ఉంచాలో కూడా నిర్ణయం తీసుకోనున్నారు. జన గణనలో కుల గణన, ముఖ్యంగా ఓబీసీ జనాభాపై సుదీర్ఘంగా నేడు జరిగే సమావేశంలో చర్చించనున్నారు. రాహుల్ గాంధీ సూచనలతో తెలంగాణలో కుల గణన జరిగిందని, కేంద్రం పై ఒత్తిడి తేవడంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన కుల గణన డిమాండు కేంద్రం తలొగ్గిందని నేతలు ప్రస్తావించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com