BJP MP : బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం

బీజేపీ రాజ్యసభ సభ్యుడు రామ్ చందర్ జంగ్రా పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాల పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీతో పాటు సమాజ్ వాది పార్టీ నాయకులు ఆయన చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. నిన్న దేవి అహల్యాబాయి హోల్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు పహల్గాం ఉగ్రదాడిలో భర్తల ప్రాణాల కోసం ప్రాదేయపడకుండా ఉగ్రవాదులతో మహిళలు పోరాడి ఉంటే నష్టం తక్కువగా జరిగి ఉండేదని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. రామ్ చందర్ జంగ్రా వ్యాఖ్యలు అభ్యంతరకరమ ని కాంగ్రెస్ పార్టీ రోహతక్ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ స్పందిస్తూ బీజేపీ నాయకులు భారత సైన్యాన్ని తరచూ అవమా నిస్తున్నారని, అమరులైన సైనికుల త్యాగాన్ని తక్కువ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా హెడ్ సుప్రియా శ్రినాతే బీజేపీ ఎంపీ వ్యాఖ్యల్ని ఖండించారు. సమాజ్వాది పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్యాదవ్ ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఎక్స్ పోస్ట్ పెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com