Corona Cases in India: దేశంలో ఒక్కరోజులోనే 13 వేలకు పైగా కరోనా కేసులు..

Corona Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య మరోసారి పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశంలో 13వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 33 రోజుల తర్వాత అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. నిన్నటితో పోలిస్తే 40 శాతానికిపైగా ఎక్కువ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, పశ్చిమ బెంగాళ్, కర్నాటక, గుజరాత్ రాష్ట్రాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఇక కోల్ కత్తాలో పాజిటివ్ కేసుల రేట్ 12.5శాతంగా ఉంది.
దేశంలో ప్రస్తుతం 961 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 320మంది పూర్తిగా కోలుకున్నారు. అయితే గత రెండు మూడు రోజులుగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. ఢిల్లీ, ముంబాయి, ఎన్నై కోల్ కత్తా లో కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల్లో ఆంక్షలు పాటించాలని,లేదంటే వైరస్ మరింత విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com