Mamata Banerjee : మమతను కాల్చిచంపాలన్న డిగ్రీ విద్యార్థి.. అరెస్ట్

కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఘటనను ఖండిస్తూ వైద్య సిబ్బంది, విద్యార్ధులతో పాటు సాధారణ ప్రజానీకం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ డిగ్రీ విద్యార్థి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి.. ఇందిరా గాంధీని కాల్చి చంపినట్లే మమతా బెనర్జీపైనా కాల్పులు జరపాలి.. అంటూ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో రాసుకొచ్చింది.
ఈ పోస్టు పై తృణమూల్ కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు సదరు విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితురాలు బీకాం సెకండియర్ చదువు తున్న కీర్తిశర్మగా పోలీసులు గుర్తించారు. సీఎంపై హత్యా యత్నానికి, అల్లర్లకు రెచ్చగొట్టేందుకు, అత్యాచార బాధితురాలి వివరాలను బయట పెట్టడం తదితర నేరాల కింద ఆ విద్యార్థిని అరెస్టు చేసినట్లు కోల్కతా పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com