Priyanka Gandhi : సోదాల పేరుతో మహిళలను ఇబ్బంది పెట్టొద్దు : ప్రియాంక గాంధీ

కేరళలో పోలీసుల తీరుపై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోదాల పేరుతో పార్టీ మహిళా నేతలు ఉన్న గదుల్లోకి ప్రవేశించడం తప్పంటూ మండిపడ్డారు. మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించారు. వయనాడ్, పాలక్కాడ్లో మరికొన్ని రోజుల్లో ఉప ఎన్నికలు జరగునున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మహిళా నేతలు పాలక్కాడ్లోని ఓ హోటల్లో ఉన్నారు. ఒక కాంగ్రెస్ కార్యకర్త బ్యాగ్తో లోపలికి ప్రవేశించారు. ఇదంతా సీసీటీవీలో రికార్డు కావడంతో అనుమానాలకు దారి తీసింది. ఎన్నికల వేళ నల్లధనాన్ని తీసుకువెళుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరపాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. సోదాలు నిర్వహించేందుకు పోలీసులు హోటల్కి వెళ్లారు. దీనిపై తాజాగా స్పందించిన ప్రియాంక గాంధీ.. పోలీసుల తీరుపై విరుచుకుపడ్డారు. ‘‘సోదాల పేరుతో అర్ధరాత్రి వేళ మహిళలు ఉన్న గదుల్లోకి వెళ్లడం చాలా పెద్ద తప్పు. పోలీసు యంత్రాంగాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది’’ అని ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com