EPF : పీఎఫ్ ఆటో సెటిల్మెంట్ పరిమితి రూ.5 లక్షలకు పెంపు

ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్) చందా దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ముందస్తు ఉపసంహరణలకు సంబంధించి ఆటో సెటిల్మెంట్ పరిధిని ఈపీఎఫ్ఓ సవరించింది. ప్రస్తుతం లక్షరూపాయలుగా ఉన్న పరిమితిని 5 లక్షల రూపాయలకు పెంచింది. దీంతో 5 లక్షల వరకు ఉన్న క్లెయిమ్లు త్వరగా సెటిల్ కానున్నాయి. అత్యవసర సమయాల్లో క్లెయిమ్స్ చేసే ఈపీఎఫ్ఎ సభ్యులకు దీని వల్ల లబ్ది చేకూరనుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మనస్సుఖ్ మాండవీయ ప్రకటించారు. కొవిడ్ సమయంలో ఆటొ సెటిల్మెంట్ విధానాన్ని తొలిసారి ఈపీఎఫ్ఓ తీసుకు వచ్చింది. సాధారణ క్లెయిమ్ను సెటిల్మెంట్ ను వేగవంతం చేసేందుకు ఆటో ప్రాసెసింగ్ ను ఈపీఎఫ్ఓ తీసుకు వచ్చింది. మానవ ప్రమేయం లేకుండా క్లెయిమ్ లను పరిష్కరించడమే దీని ఉద్దేశం. వివాహం, విద్య, ఇంటి కొనుగోలు కోసం ఈపీ ఎఫ్ఎ ఆటో సెటిల్మెంట్ సౌకర్యాన్ని ప్రవేశ పెట్టింది. దీని సాయంతో ఇక నుంచి 5 లక్షల వరకు మానవ ప్రమేయం లేకుండా వేగంగా క్లెయిమ్ చేసుకోవచ్చు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com