Mumbai : ముంబైలో ఘోర బోటు ప్రమాదం.. 13 మంది మృతి

మహారాష్ట్ర రాజధాని ముంబైలో బోటు ప్రమాదం జరిగింది. ఈ బోటు ప్రమాద ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారని, 101 మందిని రెస్క్యూ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇండియన్ నేవీకి చెందిన స్పీడ్ బోట్ ముంబై హార్బర్లో ఇంజన్ ట్రయల్స్ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇంజన్లో తలెత్తిన లోపం వల్ల ప్రమాదవశాత్తూ ప్రయాణికులతో వెళుతున్న ఫెర్రీ బోట్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ నుంచి ప్రయాణికులతో ‘ఎలిఫెంటా కేవ్స్’కు వెళుతున్న ‘నీల్ కమల్’ ఫెర్రీ బోట్ సముద్రంలో మునిగిపోయింది. 100 మందికి పైగా ఉన్న ఆ బోట్ మునిగిపోవడంతో పలువురు సముద్రంలో గల్లంతయ్యారు. నాలుగు నేవల్ హెలికాఫ్టర్స్, 11 నేవల్ క్రాఫ్ట్స్, ఒక కోస్ట్ గార్డ్ బోట్, మూడు మెరైన్ పోలీస్ క్రాఫ్స్ట్ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. 100 మందిని పైగా ఈ రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా కాపాడగలిగారు.13 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో చనిపోయిన 13 మందిలో 10 మంది ప్రయాణికులు కాగా, మిగిలిన ముగ్గురూ నేవీ సిబ్బందిగా అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com