ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు బోల్తా పడి నలుగురు మృతి
మహారాష్ట్రలోని అహ్మద్నగర్లోని నాసిక్-పూణే హైవేపై వేగంగా వస్తున్న కార్గో ట్రక్కు బోల్తా పడి కారు నుజ్జునుజ్జు కావడంతో పసిపిల్లలతో సహా నలుగురు మరణించారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వేగంగా వస్తున్న కార్గో ట్రక్కు కారును ఢీకొట్టి బోల్తా పడిందని, దాంతో వాహనం నుజ్జునుజ్జు అయిందని పోలీసులు తెలిపారు. ట్రక్కులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు మరణించారని, ఒకరికి గాయాలయ్యాయని తెలిపారు.
మృతులను ఓజస్వి ధంకర్ (2), ఆశా సునీల్ ధంకర్ (42), సునీల్ ధంకర్ (65), అభయ్ సురేష్ విశాల్ (48)గా గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన ప్రయాణికుల్లో ఒకరిని అస్మిత అభయ్ విశాల్గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ట్రక్కులో ఇనుప పైపులు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం తరువాత ట్రక్కు నుండి పడిపోయిన ఇనుప పైపులు హైవేను బ్లాక్ చేశాయి. రోడ్డుపై ఇనుప పైపులు చెల్లాచెదురుగా పడటంతో హైవేపై ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు రోడ్డును క్లియర్ చేసి ట్రాఫిక్ను అదుపు చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com