Fire Breaks Out at Ganpati Event : JP నడ్డాకు తప్పిన ప్రమాదం.. గణేష్ ఉత్సవాల్లో అపశ్రుతి

మహారాష్ట్ర పూణేలోని సానే గురూజీ తరుణ్ మిత్ర మండల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరైన గణపతి కార్యక్రమంలో అగ్నిప్రమాదం జరిగింది. ఉజ్జయినిలోని ప్రసిద్ధ మహాకాల్ దేవాలయం నమూనాలో రూపొందించిన గణపతి పండల్ పైభాగంలో మంటలు చెలరేగాయి. భద్రతా కారణాల దృష్ట్యా, హారతి కోసం ఇక్కడికి వచ్చిన జేపీ నడ్డా.. పూజా కార్యక్రమాలను మధ్యలోనే వదిలి బయటకు రావాల్సి వచ్చింది.
సెప్టెంబర్ 26న జరిగిన ఈ ఘటనా సమయంలోనే భారీ వర్షం కురవడంతో నిమిషాల వ్యవధిలోనే మంటలు ఆర్పివేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు. అంతకుముందు రోజు, JP నడ్డా లాల్బౌగ్చా రాజాతో సహా ముంబైలోని ప్రసిద్ధ గణేష్ పండళ్లను సందర్శించారు. నడ్డా తన ముంబై పర్యటనను గిర్గావ్లోని కేశవ్జీ చాల్ గణేశోత్సవ్ మండలాన్ని సందర్శించి, గణేశుని ఆశీస్సులు కోరుతూ ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే, ముంబై బీజేపీ చీఫ్ ఆశిష్ షెలార్, బీజేపీ జాతీయ కార్యదర్శి వినోద్ తావ్డే తదితర ప్రముఖులతో కలిసి ఆయన లాల్బాగ్చా రాజ గణపతి వద్దకు వెళ్లారు.
#WATCH | Pune, Maharashtra: Sane Guruji Tarun Mitra Mandal catches fire.
— ANI (@ANI) September 26, 2023
Details awaited. pic.twitter.com/N27zSpLi7Q
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com