Gold Prices : తులం బంగారం రూ.78వేలు

ఇటీవలి రోజుల్లో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి.అయితే భారీగా పెరిగే గోల్డ్ రేట్స్.. స్వల్పంగానే తగ్గుతున్నాయి. దాంతో మరోసారి పసిడి ధరలు 80 వేల మార్కుకు దగ్గరలో ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై శుక్రవారం రూ.670 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.760 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్లో శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,600 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.78,110గా ఉంది. మరోవైపు ఇటీవలి రోజుల్లో స్థిరంగా లేదా తగ్గుతూ వచ్చిన వెండి ధర.. మళ్లీ షాక్ ఇచ్చింది. బులియన్ మార్కెట్లో కిలో వెండిపై రెండు వేలు పెరిగి.. రూ.91,500గా నమోదయింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ఒక లక్ష అయింది. అత్యల్పంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో రూ.91,500గా కొనసాగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com