Gautam Adani : వచ్చే ఐదేళ్లలో భారీ పెట్టుబడులు : గౌతమ్ అదానీ

అదానీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ గౌతమ్ అదానీ వచ్చే ఐదేళ్లలో వివిధ వ్యాపా రాల్లో 15 నుంచి 20 బిలియన్ డాలర్ల పెట్టు బడులు పెట్టనున్నట్లు ప్రకటిం చారు. ప్రస్తుతం సంస్థబలమైన బ్యాలెన్స్ షీట్లు, బిజినెస్ వృద్ధిని కలిగి ఉందని తెలిపారు. అదానీ ఎంటర్ప్రైజెస్ వార్షిక నివేదిక విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. వరుస కొనుగోళ్లు, తీవ్రమైన పరిశీలనలను ఎదుర్కొన్నప్పటికీ అదానీ గ్రూప్ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదని, వ్యూహాత్మకంగా బలీయంగా ముందుకు సాగినట్లు చెప్పారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వెనక్కి తగ్గలేదని, బదులుగా తిరిగి బలీయమైనదిగా, విచ్ఛిన్నం కాలేని విధంగా మారమని చెప్పారు. చరిత్ర మనల్ని గుర్తుంచుకోవాలని, బ్యాలెన్స్ షీటు పరిమాణం కోసం కాదని, కంపెనీ బలం కోసమని చెప్పారు. నిజమైన నాయ కత్వం సంక్షోభాన్ని ఎదుర్కొనేటప్పుడు ఏర్పడుతుందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com