Income Tax Return : ఆదాయ పన్ను రిటర్న్‌ల గడువు పొడిగింపు

Income Tax Return : ఆదాయ పన్ను రిటర్న్‌ల గడువు పొడిగింపు
X

రివైజ్డ్‌ ఐటీఆర్‌ దాఖలు చేసేందుకు గడువును ఆదాయపు పన్ను విభాగం పొడిగించింది. వాస్తవానికి డిసెంబర్‌ 31 గడువు ముగియనుండగా.. భారత నివాసితులకు 2025 జనవరి 15 వరకు అవకాశం కల్పించింది. జులైలో ఎవరైతే ఐటీఆర్‌ దాఖలు చేయలేదో వారు జరిమానా చెల్లించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అలాగే గడువు లోపు ఐటీఆర్‌ సమర్పించినా ఒకవేళ అవసరమైతే రివైజ్డ్‌ ఐటీఆర్‌ దాఖలు చేయాలనుకున్నవారూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. గత ఆర్థిక సంవత్సరం అంటే 2023-24 (మదింపు సంవత్సరం 2024-25)కు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు ఈ ఏడాది జులై 31తోనే ముగిసింది. ఏదైనా కారణంతో రిటర్నుల ప్రక్రియను పూర్తి చేయని వారికి చివరి అవకాశం చట్టం కల్పిస్తోంది. అలా ఆగస్టు 1 నుంచి డిసెంబర్ 31 వరకూ దాఖలు చేసిన రిటర్నులను ‘బిలేటెడ్‌ రిటర్న్‌’గా పేర్కొంటారు. బిలేటెడ్‌ ఐటీఆర్‌ సమర్పించే వారి వార్షికాదాయం రూ.5 లక్షలలోపు ఉన్నప్పుడు రూ.1,000, అంతకుమించి ఉంటే రూ.5,000 వరకూ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా ఈ గడువును జనవరి 15 వరకు పొడిగించారు.

Tags

Next Story