CHINA-INDIA: సమస్యల పరిష్కారం దిశగా చర్చలు

పశ్చిమ సెక్టార్లో వాస్తవాధీన రేఖతో పాటు అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంపై చైనా(India- China )తో లోతైన చర్చలు జరిగాయని భారత్ ప్రకటించింది. పశ్చిమ సెక్టార్లో LACతో పాటు అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంపై ఇరుపక్షాలు లోతైన చర్చలు జరిపారు. 19వ రౌండ్ చర్చలు సరిహద్దులోని చుషుల్-మోల్డో(Chushul-Moldo border point )లో జరిగింది. దక్షిణాఫ్రికాలో జరిగే బ్రిక్స్ సదస్సుకు ముందు ఇరుదేశాల మధ్య సైనిక చర్చలు జరిగాయి. పెండింగ్లో ఉన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు(resolve border issues) డ్రాగన్ అంగీకరించిందని వెల్లడించింది. అనేక అంశాలపై ఇరు దేశాల అధికారులు సుదీర్ఘంగా చర్చించారని.. ఇరువైపుల సానుకూల వాతావరణం కనిపించిందని భారత విదేశాంగశాఖ (MEA) వెల్లడించింది.
తూర్పు లద్దాఖ్లోని నియంత్రణ రేఖ వెంబడి బలగాల ఉపసంహరణపై భారత్, చైనా సైన్యం మధ్య కమాండర్ స్థాయి చర్చలు(19th round of India- China corps commander-level meeting) జరిగాయి. ఈ చర్చల వివరాలు విదేశాంగ శాఖ వెల్లడించింది. తూర్పు లద్దాఖ్లోని నియంత్రణ రేఖ వెంట బలగాల ఉపసంహరణపై ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయని విదేశాంగశాఖ పేర్కొంది.సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతను కొనసాగించేందుకు ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చినట్లు వెల్లడించింది. దెప్సాంగ్, దెమ్చోక్ సహా ఇతర ప్రాంతాల నుంచి దళాలను త్వరగా ఉపసంహరించాలని చైనాపై ఒత్తిడి తెచ్చామని తెలిపింది. ఇరువర్గాల మధ్య సానుకూల, నిర్మాణాత్మక, లోతైన చర్చలు జరిగాయని ప్రకటించింది.
ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలకు అనుగుణంగా సరిహద్దుల్లో తాజా పరిస్థితులపై ఇరు పక్షాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు భారత్ వివరించింది. సరిహద్దులో మిగిలిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి సైనిక, దౌత్య మార్గాల ద్వారా చర్చల వేగాన్ని కొనసాగించడానికి ఇరువర్గాలు అంగీకరించాయి. అప్పటివరకు.. సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతతను నెలకొల్పేందుకు ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.
19వ రౌండ్ చర్చలకు భారత్కు లెఫ్టినెంట్ జనరల్ రషీమ్ బాలి, చైనా వైపు దక్షిణ షిన్జియాంగ్ మిలటరీ డిస్ట్రిక్ట్ చీఫ్ నాయకత్వం వహించారు. భారత్ వైపున ఉన్న చుషుల్-మోల్డోలో ఈ చర్చలు జరిగాయి. ఆగస్టు 13- 14న ఈ చర్చలు నిర్వహించారు. సరిహద్దు అంశంపై ఇరువర్గాల మధ్య ఉన్నతస్థాయి సైనిక చర్చలు వరుసగా రెండు రోజుల పాటు జరగడం ఇదే తొలిసారి. 18వ దఫా చర్చలు ఏప్రిల్ 23న జరగ్గా.. నాలుగు నెలల తరువాత మరోసారి చర్చలు నిర్వహించారు.
మూడేళ్లుగా సరిహద్దులో ఈ ప్రతిష్టంభన కొనసాగుతోంది. చైనా దళాలు దూకుడుగా ప్రవర్తిస్తూ బఫర్ జోన్లలోకి ప్రవేశించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కొన్ని సైనిక పాయింట్ల వద్ద ఇరుదేశాల దళాలు ఘర్షణ పడుతున్నాయి. పలు ప్రాంతాల నుంచి ఇరుదేశాలు తమ బలగాలను ఉపసంహరించుకున్నప్పటి.. మరికొన్ని చోట్ల పూర్తి ఉపసంహరణ ఇంకా జరగలేదు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC)లో కొనసాగుతున్న ఉద్రిక్తల మధ్య భారత్, చైనా మధ్య కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి.
గల్వాన్ ఘటన తర్వాత తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ఇప్పటి వరకు 68 వేల మంది సైనికులను మోహరించినట్లు రక్షణశాఖ ఇటీవల వెల్లడించింది. వీరితోపాటు 90కిపైగా యుద్ధ ట్యాంకులను, రేడార్ వ్యవస్థలు, అధునాతన ఆయుధాలనూ వివాదాస్పద ప్రాంతాల్లో మోహరించినట్లు తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com