భారత్ లో కొత్తగా 83,883 కరోనావైరస్ కేసులు

భారత్ లో కొత్తగా 83,883 కరోనావైరస్ కేసులు
భారత్ లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. గురువారం కొత్తగా 83,883 కరోనావైరస్..

భారత్ లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. గురువారం కొత్తగా 83,883 కరోనావైరస్ కేసులను కేంద్ర ఆరోగ్య శాఖ నివేదించింది, దీంతో మొత్తం 38,53,406 కేసులు ఇప్పటివరకూ నమోదు అయ్యాయి. ఇక గత 24 గంటల్లో 1,043 కొత్త మరణాలు నమోదయ్యాయి. 29,70,492 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 8,15,538 క్రియాశీల కేసులు ఉన్నాయి. దేశంలో మొత్తం 68,584 మరణాలు నమోదు అయ్యాయి. బుధవారం 111,72, 179 నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. ఇప్పటివరకు పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 4 కోట్లకు పైగా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story