Indian Astronaut Shubhamshu : నేడే శుభాంశు రోదసీ యాత్ర ప్రయాణం

Indian Astronaut Shubhamshu :  నేడే శుభాంశు రోదసీ యాత్ర ప్రయాణం
X

భారత వ్యోమగామి శుభాంశు శుక్ల రోదసియాత్ర ప్రయాణం కాసేపట్లో మొదలుకానుంది. ఆరుసార్లు అంతరిక్ష ప్రయాణం వాయిదా పడిన తర్వాత చివరకు బుధవారం నాడు రోదసీయాత్రకు నాసా సర్వం సిద్ధం చేసింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.01 గంటలకు యాక్సియం-4 మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నదని నాసా వెల్లడించింది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి దీన్ని ప్రయోగించనున్నట్లు తెలిపింది. వాతావరణం సరిగా లేకపోవడం, సాంకేతిక కారణాలతో ఇప్పటికే వాయిదా పడింది. వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ మిషన్ ను నిర్వహిస్తోంది. ఇస్రో, నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ)లు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. ఈ స్పేస్ క్యాప్సూలు ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి మోసుకెళ్తోంది. భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4.30 గంటలకు వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అనుసంధానం అవుతుంది. శుభాంశు శుక్లా బృందం ఐఎస్ఎస్ లో 14 రోజులపాటు ఉండి వివిధ పరిశోధనలు నిర్వహిస్తుంది.

Tags

Next Story