Indian : ప్రపంచానికి ఎయిర్ స్ట్రైక్ వివరాలు ప్రకటించిన భారత ప్రభుత్వం

X
By - Manikanta |7 May 2025 3:00 PM IST
ఉగ్రవాద శిబిరాలపై దాడులను భారత ఉన్నతాధికారులు ప్రపంచ దేశాలకు వివరించారు. పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్టు అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా, యూఏఈకి సమాచారం అందించారు. మెరుపు దాడులపై వాషింగ్టన్ డీసీలోని భారత ఎంబసీ ప్రకటన విడుదల చేసింది. పాక్ పౌరులు, ఆర్థిక, సైనిక స్థావరాలపై దాడి చేయలేదని స్పష్టం చేసింది. ఈమేరకు అమెరికా విదేశాంగ కార్యదర్శితో .. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ మాట్లాడారు. మరో వైపు ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులకు స్పందించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com