Indian Railways : రైలులో ఇకపై విమానం రూల్.. 1st AC లో 70 కిలోల వరకే ఫ్రీ..పరిమితి దాటితే అదనపు చార్జీ

Indian Railways : రైలులో ప్రయాణించేటప్పుడు అవసరానికి మించి ఎక్కువ సామాను తీసుకెళ్లేవారికి ఇది చాలా ముఖ్యమైన వార్త. ఇకపై రైలు ప్రయాణంలో కూడా విమాన ప్రయాణం మాదిరిగానే లగేజీ లిమిట్స్ పై కఠిన నిబంధనలు అమలు కానున్నాయి. రైలులో నిర్ణీత పరిమితికి మించి సామాను తీసుకెళ్తే, ప్రయాణీకులు తప్పనిసరిగా అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. లోక్సభలో అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ కీలక సమాచారాన్ని తెలియజేశారు. ప్రయాణీకులు తమ తరగతి ఆధారంగా ఎంత సామాను ఉచితంగా తీసుకెళ్లవచ్చో ఇప్పటికే నిర్ణయించామని, పరిమితిని మించిన సామానుకు చార్జీ చెల్లించాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.
రైల్వే నిబంధనల ప్రకారం.. ప్రతి ప్రయాణీకుడికి వారి టికెట్ తరగతిని బట్టి ఉచితంగా తీసుకెళ్లడానికి అనుమతించబడిన సామాను బరువు, అదనపు చార్జీ చెల్లించి తీసుకెళ్లగలిగే గరిష్ట పరిమితి నిర్ణయించబడింది. స్లీపర్ క్లాస్ తరగతి ప్రయాణీకులకు 40 కిలోల వరకు సామాను ఉచితం. అదనపు చార్జీ చెల్లిస్తే, గరిష్టంగా 80 కిలోల వరకు తీసుకెళ్లవచ్చు. సెకండ్ క్లాస్ లో 35 కిలోల వరకు సామాను ఉచితం. గరిష్టంగా 70 కిలోల వరకు చార్జీ చెల్లించి తీసుకెళ్లవచ్చు. 1st AC తరగతికి ఉచిత పరిమితి 70 కిలోలు. AC 3 టైర్ / చైర్ కార్ తరగతుల్లో 40 కిలోల వరకు మాత్రమే సామాను తీసుకెళ్లడానికి అనుమతి ఉంది. ఈ తరగతులకు ఇదే గరిష్ట పరిమితి కూడా.
రైల్వే ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయడానికి ప్రధాన కారణం ఉంది. అవసరానికి మించి భారీ సామాను తీసుకెళ్లడం వలన ఇతర ప్రయాణీకుల కదలికలకు ఆటంకం కలగడంతో పాటు, భద్రత, కోచ్లలో పరిశుభ్రత సమస్యలు తలెత్తుతాయి. భారీ సామాను వలన ప్రమాదాలు జరిగే అవకాశం కూడా పెరుగుతుంది. అందువల్ల రైల్వే ఇప్పుడు బ్యాగేజ్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించింది. ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునేటప్పుడు సామాను బరువును తప్పకుండా తనిఖీ చేసుకోవాలి. అదనపు సామాను ఉంటే ముందుగానే బుక్ చేసుకోవడం లేదా అదనపు రుసుము చెల్లించడానికి సిద్ధంగా ఉండటం మంచిది, తద్వారా ప్రయాణంలో ఇబ్బందులు పడకుండా ఉండవచ్చు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

