Arvind Kejriwal : కేజ్రీవాల్ రిలీజ్ జోష్.. తొలిరోజు గడిచింది ఇలా!

మద్యం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కు సుప్రీంకోర్టులో ఎట్టకేలకు ఊరట లభించింది. శుక్రవారం నాడు బెయిల్ మంజూరు చేయడంతో ఆరు నెలల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. సెప్టెంబర్ 5న తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు.. తుది తీర్పు వెలువరించింది. తీహార్ జైలు వద్ద ఆప్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కేజీవాలకు ఘనంగా స్వాగతం పలికారు. సుప్రీం తీర్పుపై ఆప్ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. జైలు బయట మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు.
మద్యం విధానానికి సంబంధించి అవకతవకల వ్యవహారంలో కేజీవాల్ ను ఈడీ అరెస్టు చేయడంతో మార్చి 21 నుంచి జైల్లోనే ఉంటున్నారు. రూ.10 లక్షల పూచీకత్తు, ఇద్దరు వ్యక్తుల ష్యూరిటీ ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అదేవిధంగా పలు షరతులు కూడా విధించింది. ఈ కేసు గురించి ఎక్కడా బహిరంగ వ్యాఖ్యలు చేయకూడదని, సచివాలయంలోని ముఖ్య మంత్రి కార్యాలయానికి వెళ్లొద్దని, లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేకుండా ఎలాంటి అధికారిక ఫైళ్లపై సంతకాలు సైతం చేయవద్దని ఆదేశించింది.
కేసు విచారణ నిమిత్తం ట్రయల్ కోర్టు ఎదుట హాజరు కావాలని సుప్రీంకోర్టు షరతులు విధించింది. లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేసి పెట్టేందుకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గడువు ముగియగానే జూన్ 2న తీహార్ జైలులో లొంగిపోయారు. కేజ్రీవాల్ విడుదల కాగానే తిహార్ జైలు నుంచి ఢిల్లీలోని పార్టీ ఆఫీస్, ఆయన ఇంటి వద్ద కోలాహలం కనిపించింది. ర్యాలీగా వచ్చిన ఆయనకు ఢిల్లీలోని అభిమానులు వెల్కమ్ తెలిపారు. మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా ఆయనను ఆలింగనం చేసుకుని విష్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com