Kerala: సొంతింటి కలను నిజం చేసుకున్నారు.. కానీ రెండురోజులకే సజీవ దహనం అయ్యారు..

Kerala: సొంతింటి కలను నిజం చేసుకున్నారు.. కానీ రెండురోజులకే సజీవ దహనం అయ్యారు..
Kerala: కేరళ ఇడుక్కి జిల్లాలోని పుత్తడి గ్రామంలో రవీంద్రన్, ఉష దంపతులు తమ ఇటీవల తమ సొంతింటి కలను నిజం చేసుకున్నారు.

Kerala: సొంతిల్లు కట్టుకోవాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కల. అలాంటి కల నెరవేర్చుకోవడానికి కొందరు జీవితాంతం కష్టపడుతూనే ఉంటారు. ఆ కుటుంబం కూడా అలాలే కలలు కన్నారు. ఆ కలని నిజం చేసుకున్నారు కూడా. కానీ ఆ సంతోషమంతా రెండురోజులు కూడా లేదు. కేరళలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన మనసును కలచివేసేలా ఉంది.

కేరళ ఇడుక్కి జిల్లాలోని పుత్తడి గ్రామంలో రవీంద్రన్, ఉష దంపతులు తమ ఇటీవల తమ సొంతింటి కలను నిజం చేసుకున్నారు. వీరు పేద కుటుంబానికి చెందినవారే అయినా ప్రభుత్వం సాయంతో వీరికి సొంతిల్లు నిర్మాణం పూర్తయ్యింది. అయితే ఇంట్లోకి వెళ్లిన రెండు రోజులకే అగ్ని ప్రమాదం జరగడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమవ్వడంతో పాటు రవీంద్రన్, ఉష సజీవ దహనమయ్యారు.

ప్రమాద సమయంలో వారి కూతురు శ్రీ ధన్య కూడా ఇంట్లోనే ఉంది. అయితే మంటలకు భయపడి తను గట్టిగా అరుస్తూ ఇంటిపై నుండి దూకేసింది. స్థానికులు ఇది గమనించి మంటలను అదుపుచేసి కుటుంబం మొత్తాన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రవీంద్రన్, ఉష చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. శ్రీ ధన్య మాత్రం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది.

Tags

Read MoreRead Less
Next Story