Kumbh Mela : చివరి ఘట్టానికి చేరుకున్న మహాకుంభ్

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహాకుంభ్ వేడుక చివరి ఘట్టానికి చేరుకుంది. నెలన్నర రోజులుగా జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక నేటితో ముగియనుంది. దీంతో పుణ్యస్నాల కోసం సామాన్య భక్తులతోపాటు ప్రముఖులు సైతం ప్రయాగరాజ్ కు పోటెత్తుతున్నారు. చివరి అమృత్ స్నానం కోసం కోటి మం దికిపైగా భక్తులు వస్తారని యూపీ సర్కా ర్ అంచనా వేస్తోంది. అందుకు అను గుణంగా ఏర్పాట్లు చేస్తోంది. రద్దీని నియంత్రించేందుకు అధికారులు ప్రయాగ్ రాజ్ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మంగళవారం సాయంత్రం 4. గంటల నుంచి కుంభమేళా ప్రాంతాన్ని 'నోవెహికల్ జోన్'గా మారుస్తున్నామని ప్రకటించారు. సాయంత్రం 6 గంటలకు సర్వీసులకు చెందిన వాహనాలను మాత్రమే అనుమతించ నున్నట్లు ప్రకటించారు. యాత్రికులంతా ఈ మార్గదర్శకాలను పాటించాలని, అధికారులకు సహకరించాలని ప్రభుత్వం కోరింది.
జనవరి 13న కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దా దాపు 64 కోట్ల మందికిపైగా భక్తులు త్రివేణీ సంగమంలో స్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్ ప్రకటించింది. ఇక చివరి రోజు భారీగా భక్తులు తరలివస్తారని, దీంతో ఈ సంఖ్య 65 కోట్ల మార్కు ను దాటేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. మహా కుంభ్ పూర్తయ్యాక గిన్నిస్ రికార్డు లక్ష్యంగా క్లీన్ డ్రైవ్ చేయాలని యూపీ సర్కార్ భావిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com