TERROR: వెయ్యి మంది సూసైడ్ బాంబర్లు ఉన్నారు..

TERROR: వెయ్యి మంది సూసైడ్ బాంబర్లు ఉన్నారు..
X
మరింత బరితెగించిన పాక్ ముష్కరుడు... భారత్‌కు మసూద్ అజర్ హెచ్చరిక.. ఏ క్షణమైనా భారత్ పై దాడి చేస్తామని ప్రగల్భాలు.. ఎంత మంది ఉన్నారో చెప్తే హడలిపోతారని వ్యాఖ్య

ని­షే­ధిత ఉగ్ర­వాద సం­స్థ జైషే మహ్మ­ద్ మరో­సా­రి భా­ర­త్‌­ను బె­ది­రిం­చే ప్ర­య­త్నం చే­సిం­ది. ఆ సం­స్థ అధి­నేత, ఐక్య­రా­జ్య­స­మి­తి ప్ర­క­టిం­చిన అం­త­ర్జా­తీయ ఉగ్ర­వా­ది మసూ­ద్ అజర్ పే­రు­తో వె­లు­వ­డిన ఒక కొ­త్త ఆడి­యో రి­కా­ర్డిం­గ్ దే­శ­వ్యా­ప్తం­గా తీ­వ్ర కల­క­లం రే­పు­తోం­ది. ఈ ఆడి­యో­లో భా­ర­త్‌­పై ఘోర దా­డు­లు జరి­పేం­దు­కు తన వద్ద వె­య్యి మం­ది­కి పైగా ఆత్మా­హు­తి బాం­బ­ర్లు సి­ద్ధం­గా ఉన్నా­ర­ని మసూ­ద్ అజర్ సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­సి­న­ట్లు వి­ని­పి­స్తోం­ది. తా­జా­గా వై­ర­ల్ అవు­తు­న్న ఈ ఆడి­యో­లో, “ఒకరు, ఇద్ద­రు కాదు… వం­ద­ల్లో కూడా కాదు… వె­య్యి కంటే ఎక్కువ మంది సూ­సై­డ్ బాం­బ­ర్లు మా వద్ద ఉన్నా­రు” అని మసూ­ద్ అజర్ పే­ర్కొ­న్నా­డు. తాను పూ­ర్తి సం­ఖ్య­ను బయ­ట­పె­డి­తే అం­త­ర్జా­తీయ మీ­డి­యా­లో పె­ద్ద దు­మా­రం చె­ల­రే­గు­తుం­ద­ని వ్యా­ఖ్యా­నిం­చా­డు. భా­ర­త్‌­లో­కి చొ­ర­బ­డి ఎప్పు­డై­నా వి­ధ్వం­సం సృ­ష్టిం­చ­డా­ని­కి తమ అను­చ­రు­లు సి­ద్ధం­గా ఉన్నా­ర­ని, దా­డు­ల­కు వె­ళ్లా­ల­ని తనపై తీ­వ్ర ఒత్తి­డి తె­స్తు­న్నా­ర­ని కూడా అతడు ఈ ఆడి­యో­లో చె­ప్పి­న­ట్లు తె­లు­స్తోం­ది.

ఈ హె­చ్చ­రి­క­లు రా­వ­డం వె­నుక ఇటీ­వల జరి­గిన పరి­ణా­మా­లే కా­ర­ణ­మ­ని భద్ర­తా వర్గా­లు భా­వి­స్తు­న్నా­యి. గత ఏడా­ది ఏప్రి­ల్ 22న జమ్మూ కా­శ్మీ­ర్‌­లో­ని పహ­ల్గా­మ్‌­లో జరి­గిన ఉగ్ర­దా­డి­లో 26 మంది మృతి చెం­దిన వి­ష­యం తె­లి­సిం­దే. దా­ని­కి ప్ర­తి­గా భారత దళా­లు ఆప­రే­ష­న్ సిం­దూ­ర్ చే­ప­ట్టా­యి. ఈ ఆప­రే­ష­న్‌­లో భా­గం­గా పా­కి­స్తా­న్‌­లో­ని బహ­వ­ల్పూ­ర్‌­లో ఉన్న జైషే మహ్మ­ద్ ప్ర­ధాన కేం­ద్రం­పై భారత సై­న్యం దా­డు­లు జరి­పిం­ది. ఆ దా­డు­ల్లో మసూ­ద్ అజ­ర్‌­కు అత్యంత సన్ని­హి­తు­లైన బం­ధు­వు­లు సహా మొ­త్తం 11 మంది హత­మై­న­ట్లు సమా­చా­రం.

ఈ పరి­ణా­మాల నే­ప­థ్యం­లో­నే తాజా ఆడి­యో ద్వా­రా మసూ­ద్ అజర్ భా­ర­త్‌­ను బె­ది­రి­స్తు­న్నా­డ­ని భారత భద్ర­తా సం­స్థ­లు అం­చ­నా వే­స్తు­న్నా­యి. ఇప్ప­టి­కే దే­శ­వ్యా­ప్తం­గా భద్ర­తా బల­గా­లు హై అల­ర్ట్ ప్ర­క­టిం­చా­యి. సరి­హ­ద్దు ప్రాం­తా­ల­తో పాటు కీలక నగ­రా­ల్లో నిఘా మరింత కఠి­న­త­రం చే­శా­రు. ఇది­లా ఉం­డ­గా, ఇటీ­వల ఢి­ల్లీ­లో జరి­గిన వరుస బాం­బు పే­లు­ళ్ల­లో 15 మంది మృతి చెం­ద­డం దే­శా­న్ని కల­చి­వే­సిం­ది. ఈ ఘటన వె­నుక కూడా జైషే మహ్మ­ద్ హస్తం ఉం­డొ­చ్చ­ని ఢి­ల్లీ పో­లీ­సు­లు అను­మా­నం వ్య­క్తం చే­స్తు­న్నా­రు. ఈ కే­సు­లో అరె­స్టైన ఉమర్ మహ­మ్మ­ద్ అనే నిం­ది­తు­డి­కి జైషే మహ్మ­ద్ ఉగ్ర­సం­స్థ­తో సం­బం­ధా­లు ఉన్న­ట్లు ప్రా­థ­మిక వి­చా­ర­ణ­లో తే­లిం­ద­ని పో­లీ­సు­లు వె­ల్ల­డిం­చా­రు.

మసూద్ ఆచూకీపై కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2019 తర్వాత అతడు బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. అదే ఏడాది బహవల్పూర్‌లో అతని స్థావరంపై జరిగిన భారీ పేలుడులో అతడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటి నుంచి రహస్య ప్రదేశంలో తలదాచుకుంటున్నాడని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. పాకిస్థాన్ గడ్డపైనే ఉండి భారత్‌పై దాడులకు వ్యూహాలు రచిస్తున్నాడని భద్రతా సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తంగా చూస్తే, మసూద్ అజర్ తాజా హెచ్చరికలు కేవలం మాటలకే పరిమితం కావచ్చా? లేక కొత్త దాడులకు సంకేతమా? అన్నది ఇప్పుడు దేశ భద్రతా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

Tags

Next Story