మోదీ డిగ్రీ కేసులో కేజ్రీవాల్ రివ్యూ పిటిషన్

మోదీ డిగ్రీ కేసులో కేజ్రీవాల్ రివ్యూ పిటిషన్
ప్రధాని మోదీ విద్యార్హతల విషయంలో గుజరాత్ హైకోర్టు తీర్పును మరోసారి సమీక్షించాలన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్

ప్రధాని మోదీ విద్యార్హతల విషయంలో గుజరాత్ హైకోర్టు తీర్పును మరోసారి సమీక్షించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు. దీనిని స్వీకరించిన గుజరాత్ హైకోర్టు జస్టిస్ బీరన్ వైష్ణవ్ విచారణ అనంతరం కేసును జూన్ 30కి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో గుజరాత్ యూనివర్శిటీ, కేంద్ర ప్రభుత్వం, మాజీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎం శ్రీధర్ ఆచార్యలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అసలేం జరిగింది అంటే : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యార్హతలు తెలియజేయాలంటూ 2016లో అరవింద్ కేజ్రీవాల్ సమాచార హక్కు చట్టం కమిషనర్ కు ఒక లేఖ రాశారు. దీనిపై స్పందించిన కమిషనర్ రాజనీతి శాస్త్రంలో మోదీ మాస్టర్స్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. అయితే ఇదే అంశంపై కేజ్రీవాల్ ఢిల్లీ యూనివర్సిటీకి ఒక లేఖ రాశారు. మోడీ సర్టిఫికెట్ట్ ను యూనివర్సిటీ వెబ్సైట్లో ప్రచురించాల్సిందిగా కోరారు. దీనితో మోది విద్యార్హతను వెల్లడించాలని ప్రధాని కార్యాలయం, గుజరాత్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీలను కోరారు సమాచార కమిషనర్. విషయం కోర్టుకి వెళ్లడంతో గుజరాత్ విశ్వవిద్యాలయాన్ని ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను గుజరాత్ హైకోర్టు పక్కన పెట్టింది. మోడీ కి సంబంధించిన సర్టిఫికెట్లను పియం ఓ బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. అంతేకాదు కేసు వేసిన కేజ్రీవాల్ కు 25 వేల రూపాయల జరిమానా విధించింది. అందుకు నాలుగు వారాల గడువు విధించింది. అయితే ఇప్పుడు తాజాగా అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాది గుజరాత్ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ప్రధాని మోడీ డిగ్రీ ఆన్లైన్ లో అందుబాటులో ఉందని గుజరాత్ విశ్వవిద్యాలయం చెప్పిందని అయితే విశ్వవిద్యాలయ వెబ్సైట్లో అలాంటి డిగ్రీ అసలు అందుబాటులోనే లేదని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.

అంతేకాదు కేజ్రీవాల్ కు విధించిన 25 వేల రూపాయల జరిమానా విషయంలో కూడా సమీక్షించాలని కోరారు. మోడీ విద్యార్హతలు తెలుసుకోవడం కోసం తను ఎలాంటి డిమాండ్ చేయలేదని సాధారణంగా ఒక లెటర్ ను మాత్రమే రాశానని దానిని సి ఐ సి సుమోటూ గా స్వీకరించింది కేజ్రీవాల్ అభిప్రాయ పడ్డారు. ఈ రివ్యూ పిటిషన్ పై విచారణను గుజరాత్ హైకోర్టు జూన్ 30 కు వాయిదా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story