Pawan - Kangana : హిందూ యువతిని బలి చేస్తారా?.. గళమెత్తిన పవన్,కంగనా

సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ శర్మిష్ట పనోలీని పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేయడంపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నుంచి దేశానికి దాదాపు 7,000 కి.మీ.ల ఆవల ఉన్న నెదర్లాండ్స్ దాకా శర్మిష్టకు ఎనలేని మద్దతు లభించింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని, ఆమె విడుదలకు మార్గం సుగమం చేయాలని వారంతా డిమాండ్ చేశారు. ఇదే విషయమై పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పనోలి అరెస్టును తప్పుపట్టారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన ఒక వీడియోను షేర్ చేశారు.
ఆమె నేతృత్వం వహిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీలు సనాతన ధర్మాన్ని దారుణంగా ఎగతాళి చేసారని ఆరోపించారు. పవన్ షేర్ చేసిన వీడియోలో బెంగాల్ లో వేర్పాటు రాజకీయల ద్వారా మత కలహాలను ఎగ దోయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని మమత విమర్శించారు. అలా చేయడం అసలైన హిందూయిజమ్ సూత్రాలకు పూర్తి విరుద్ధమైన గంధా ధర్మ(మలినమైన ధర్మం) తప్ప మరొకటి కాదని మమతా వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో చేసిన పోస్టులో పశ్చిమ బెంగాల్ పోలీసులు శర్మిష్ఠపై చర్య తీసుకోవడంలో చాలా వేగంగా స్పందించారు. కానీ టీఎంసీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ఎంపీలు సనాతన ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడి కోట్లాది మంది ప్రజలకు తీవ్రమైన మానసిక వేదన కలిగించిన సంగతి ఏమైంది? మన విశ్వాసాన్ని గంధా ధర్మ అని అన్నప్పుడు ఎందుకు చలించలేదు? వారెందుకు క్షమాపణ చెప్పలేదు? వారినెందుకు అరెస్టు చేయలేదు? అని నిలదీశారు. దైవ దూషణను ఖండించాలి. సెక్యూలరిజమ్ అనేది కొందరికి రక్షా కవచం కాదు.. ఇతరులకు ఖడ్గం కాదు. అది రెండు వైపులా దారులు ఉన్న వీధిలా ఉండాలి. పశ్చిమ బెంగాల్ పోలీసులు.. దేశం మిమ్మల్ని చూస్తోంది. అందరి కోసం పని చేయండి అని ఆయన అన్నారు.
ఇదే విషయమై బీజేపీ ఎంపీ, సినీనటి కంగనా రనౌత్ మాట్లాడుతూ శర్మిష్ట కొన్ని అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేయడాన్ని నేను కాదనడంలేదు. కానీ అలాంటి పదాలను నేటి కుర్రకారులో ఎక్కువ మంది యధాలాపంగా వాడేస్తున్నారు. చేసిన వ్యాఖ్యలకు ఆమె క్షమాపణ చెప్పింది. అది సరిపోతుంది. ఆమెను వేధించవద్దు. ఆమెను వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని నార్త్ కొరియాలా మార్చ డానికి ప్రయత్నించవద్దని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కంగనా రనౌత్ విజ్ఞప్తి చేశారు. ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకోవడానికి ఒక హిందూ యువతిని లక్ష్యంగా చేసుకున్నారని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా మండిపడ్డారు.
శర్మిష్ట విడుదలకు చొరవ తీసుకోవాలని నెదర్లాండ్స్ పార్టీ ఫర్ ఫ్రీడమ్ నేత, డచ్ పార్లమెంట్ సభ్యుడు గిర్ట్ వైల్డెర్స్ ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. ఫోన్ చేశారు. ఇదే సమయంలో ఎక్స్ చేసిన పోస్టులో ధైర్యవంతు రాలైన శర్మిష్టపనోలీని విడుదల చేయాలి. ఆమెను అరెస్టు చేయడం భావవ్యక్తీకరణకు అవమానకరం.. పాకిస్తాన్ గురించి, ముహమ్మద్ గురించి నిజం మాట్లాడినందుకు ఆమెను శిక్షించవద్దు. నరేంద్ర మోడీ ఆమెకు సాయం చేయండి అని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com