Kishan Reddy : ఒక్క రూపాయి అవినీతి జరగలేదు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy : ఒక్క రూపాయి అవినీతి జరగలేదు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
X

11 ఏండ్లలో మోదీ పాలనలో ఒక్క అవినీతి మరక లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పేదల అభివృద్ధి, సం క్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంద న్నారు. దేశంలో 29% ఉన్న పేదరికాన్ని 11.28 శాతానికి తగ్గించామని తెలిపారు. అదే సమయంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందని పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమం లో కిషన్ రెడ్డి మాట్లాడారు. 'ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. విద్య, ఆరోగ్య రంగాల్లో పేదలకు లబ్ది చేకూరుతోంది. పారిశ్రామిక, ఐటీ, వ్యవసాయ రంగాల్లో సంస్క రణల ఫలితంగా దేశం ఆర్థికంగా బలపడు తుంది.11 ఏండ్లలో ఒక్క రూపాయి అవినీతి జరిగిందని ఏ రాజకీయ పార్టీ కూడా ఆరోప ణలు చేయలేదు. పారదర్శక పాలనకు మోదీ ప్రభుత్వం ఉదాహరణ. నీతి నిజాయితీతో ఒక సమర్థవంతమైన నాయకత్వంతో ఎన్డీఏ పాలన కొనసాగుతోంది. ప్రపంచ దేశాలు సైతం ఇండియావైపే చూస్తున్నాయి' అని తెలిపారు.

Tags

Next Story