Operation Sindhu: ఇరాన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న 10 మంది ఏపీ విద్యార్థులు

Operation Sindhu:  ఇరాన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న 10 మంది ఏపీ విద్యార్థులు
X
ఇప్పటివరకు దాదాపు 1,750 మంది భారతీయులను స్వదేశానికి చేర్చిన కేంద్రం

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్‌ సింధు’ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఇరాన్‌ నుంచి 10 మంది ఏపీ విద్యార్థులు మంగళవారం సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారు. విదేశాంగ శాఖ ప్రత్యేక చొరవ తీసుకుని వీరిని భారత్‌కు తీసుకువచ్చింది.

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ దేశాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిన విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగానే విదేశాంగ శాఖ ‘ఆపరేషన్‌ సింధు’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీని ద్వారా ఇప్పటివరకు సుమారు 1,750 మంది భారతీయులను ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి తరలించినట్లు అధికారులు తెలిపారు. తాజాగా ఇరాన్‌లో ఉన్న 10 మంది ఏపీ విద్యార్థులు కూడా ఈ ఆపరేషన్ ద్వారా ఢిల్లీకి క్షేమంగా చేరుకున్నారు.

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ నుంచి తిరిగి వస్తున్న భారతీయుల కోసం ఢిల్లీలో ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ఢిల్లీలోని ఏపీ భవన్‌, తెలంగాణ భవన్‌లలో వీరికి వసతి సౌకర్యాలు కల్పించారు. ఢిల్లీకి చేరుకున్న విద్యార్థులను వారి స్వస్థలాలకు పంపించేందుకు రెండు రాష్ట్రాల రెసిడెంట్‌ కమిషనర్లు ప్రత్యేకంగా రెండు బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ బృందాలు విద్యార్థులతో సమన్వయం చేసుకుంటూ వారి ప్రయాణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి.

Tags

Next Story