Union Minister : సిందూ జలాల ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది : కేంద్ర మంత్రి

సిందూ జలాల ఒప్పందాన్ని పొరుగు దేశం పాకిస్తానే ఉల్లంఘించిందని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్థన్ సింగ్ అన్నారు. ఆ దేశం నుంచి తమ భూభాగంలోకి సీమాంతరం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. సిందూ జలాల ఒప్పందం రద్దు విషయంలో భారత్ను నిందించడం మానుకో వాలన్నారు. హిమానీనదాలపై తజకిస్తాన్లో జరిగిన ఐక్యరాజ్యసమితి ప్లీనరీ సెషన్లో మా ట్లాడారు. ఒప్పందంపై సంతకాలు చేసినప్పటి నుంచి పరిస్థితులల్లో అనేక మార్పులొచ్చినట్లు చెప్పారు. క్లైమేట్ చేంజ్, జనాభా పెరుగుదల, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి, సీమాంతర ఉగ్ర వాదంలో కొనసాగుతున్న ముప్పు అంశాలను ఇందుకు ఉదాహరణగా చూపించారు. అంతకు ముందు ఇదే సమావేశంలో మాట్లాడిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. సంకుచిత రాజకీయ ప్రయోజకనాల కోసం లక్షలాది మంది జీవితా లను ప్రమాదంలో పడేసే సిందూనది జలాల ఒప్పందాన్ని ఇండియా నిలిపివేయడాన్ని తమ దేశం అనుమతించదని వ్యాఖ్యానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com