Amit Shah : పాకిస్తాన్ గొంతు ఎండాల్సిందే : అమిత్ షా

సింధూ నదీ జలాలను నదీ జలాలను రాజస్థాన్ కు మళ్లిస్తామని, పాకిస్తాన్ గొంతులు ఎండాల్సిందేనని హోంశాఖ మంత్రి అమిత్ షా ఉద్ఘాటిం చారు. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్దరించే ప్రసక్తే లేదన్నారు. ఈ ఒప్పందం నిబంధనలను పాకిస్థాన్ ఉల్లంఘించిందని ఆయన మండిపడ్డా రు. ఇన్నాళ్లూ దాయాది అన్యాయంగా నీళ్లు వాడుకుందని, ఇకపై నీటి కొరతతో" అల్లాడిపోవాల్సిందేనని దుయ్యబట్టారు. అంతర్జాతీయ ఒప్పందాలను ఏకపక్షం గా రద్దు చేయలేమని, కానీ సింధూ నదీ” జలాల ఒప్పందాన్ని నిలిపివేసే హక్కు... భారత్ కు ఉందని చెప్పారు. తాము కూడా అదే చేశామని వివరించారు. ఈ ఒప్పందం పీఠికలో రెండు దేశాలు శాంతి, పురోగతి సాధించాలనే విషయాన్ని పొందుపరిచాయని చెప్పారు. కానీ, ఒకసారి దీన్ని ఉల్లంఘిస్తే రక్షించడా నికి ఇంకేమీ ఉండదన్నారు. భారత్ కు హక్కుగా లభించిన నీటిని సమర్థంగా వినియోగిస్తామని చెప్పారు. కెనాలు నిర్మించి పాకిస్తాన్ కు వెళ్లే నీటిని రాజ స్థాన్ కు మళ్లిస్తామని అన్నారు. ఇకపై ఆ దేశం గొంతు ఎండాల్సిందేనని అమిత్ షా అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com