PM Modi: విదేశాల నుంచి తిరిగి వచ్చిన ఎంపీ బృందాలకు ప్రధాని విందు

PM Modi: విదేశాల నుంచి తిరిగి వచ్చిన ఎంపీ బృందాలకు  ప్రధాని  విందు
X
ఉగ్రవాదానికి పాకిస్తాన్ అందిస్తున్న సాయంపై ఇతర దేశాలకు తేల్చి చెప్పిన భారత ప్రతినిధి టీమ్..

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ ను మట్టికరిపించింది నరేంద్ర మోడీ సర్కార్. ఈ సందర్భంగా ఉగ్రవాదానికి, పాక్ కి వ్యతిరేకంగా మద్దతు మూటగట్టుకోవడానికి దేశంలో అన్ని పార్టీలకు చెందిన అఖిలపక్ష ప్రతినిధి ఎంపీల బృందం ప్రపంచ రాజధానులను సందర్శించి టెర్రరిజంపై భారత్ వైఖరిని స్పష్టంగా తెలియజేసింది. ఈ ప్రతినిధి బృందాల్లో 50 మందికి పైగా వ్యక్తులు ఉన్నారు.. వీరిలో ఎక్కువ మంది సిట్టింగ్ ఎంపీలు కాగా, వీరందరూ.. 33 విదేశీ రాజధానులతో పాటు యూరోపియన్ యూనియన్‌ను సందర్శించిన ఈ ప్రతినిధుల బృందంలో మాజీ దౌత్యవేత్తలు కూడా ఉన్నారు.

ఇక, విదేశాల నుంచి తిరిగి వచ్చిన ఎంపీల ప్రతినిధి బృందాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు విందుకు ఆహ్వానించారు. ఈరోజు (జూన్ 10) రాత్రి 7 గంటలకు ప్రధాని నివాసం, లోక్ కళ్యాణ్ మార్గ్‌లో నరేంద్ర మోడీ అందరితో విందులో పాల్గొంటారు. మరోవైపు, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇప్పటికే ప్రతినిధుల బృందాలను కలిసి పాకిస్తాన్, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం యొక్క బలమైన వైఖరిని తెలియజేసిన వారి ప్రయత్నాలను ప్రశంసించారు.

Tags

Next Story