PM Modi : 23న యుక్రెయిన్ కు ప్రధాని మోడీ

PM Modi : 23న యుక్రెయిన్ కు ప్రధాని మోడీ
X

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోలాండ్, యుక్రెయిన్ పర్యటన తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 21న పోలండ్, 23న యుక్రెయిన్ లో మోడీ పర్యటించనున్నారు. ఆగష్టు 21న పోలాండ్లో ఆ దేశ ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత ప్రధాని పోలాండ్లో పర్యటించడం గత 45 ఏళ్లలో ఇదే తొలిసారి.

ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలపై నేతలు చర్చించనున్నారు. పోలాండ్ నుంచి 23వ తేదీన మోడీ.. ఉక్రెయిన్ పర్యటనకు వెళ్తారు. ఇది ఎంతో ప్రాధాన్యత కలిగిన పర్యటన అని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్య దర్శి తన్మయలాల్ సోమవారం ప్రకటించారు.

రేపు, ఎల్లుండి పోలండ్ పర్యటన ఉంటుంది. యుక్రెయిన్ లో కొనసాగుతున్న యుద్ధంపై ఇరువురు నేతలు చర్చించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు రష్యాతో వివాదం తర్వాత యుక్రెయిన్ లో ప్రధాని మోడీకి ఇదే తొలి పర్యటన. గత 30 ఏళ్లలోనూ భారత ప్రధాని యుక్రెయిన్ లో పర్యటించడం ఇదే తొలిసారి. మాస్కోలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ అయిన నెల రోజుల తర్వాత ఉక్రెయిన్లో మోడీ పర్యటిస్తుండటం విశేషం.

Tags

Next Story