PM Modi : విమాన ప్రమాదంపై ప్రధాని ఆరా.. అమిత్ షా పయనం

PM Modi : విమాన ప్రమాదంపై ప్రధాని ఆరా.. అమిత్ షా పయనం
X

అహ్మదాబాద్‌ లో జరిగిన విమాన ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీశారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడితో ఫోన్ లో మాట్లాడారు. ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల వేగవంతం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వివరాలను తనకు అప్‌డేట్‌ చేయాలని కేంద్రమంత్రిని ఆదేశించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ ప్రధాని ఫోన్‌లో మాట్లాడారు. వెంటనే అహ్మదాబాద్‌ వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని రామ్మోహన్‌ నాయుడు, అమిత్‌ షాకు ప్రధాని సూచించారు.

Tags

Next Story