POK : పాక్ ఆక్రమిత కశ్మీర్ లో నిరసనల హోరు

భారత్ ఆపరేషన్ సిందూర్ తో చావు దెబ్బ తిన్న పాకిస్తాన్ కు స్థానిక వ్యాపారులు నుంచి నిరసనల సెగ మరింత తగులుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని గిల్గిత్-బాల్టిస్టాన్లోని స్థానిక వ్యాపారులు.. తమ స్వప్రయోజనాలను పాక్ ప్రభుత్వం తమను పణంగా పెడుతోందని ఆందోళన బాటపట్టారు. వీళ్లకు స్థానిక రాజకీయ పార్టీలు మద్దతు తెలుపడంతో ఉద్యమం మరింత ఉధృతమవుతోంది. సరిహద్దుల్లోని సోస్త్ డ్రై పోర్ట్ ద్వారా దిగుమతి చేసుకున్న ఉత్పత్తులకు కస్టమ్స్ క్లియరెన్సు అనుమతులు ఇవ్వకపోవడంతో గత ఆరు నెలలుగా కన్ సైన్ మెంట్లు నిలిచిపోయి సరుకు చెడిపోయి నష్టపోవడంతో వ్యాపారులు ఆందోళన చేస్తున్నారు. స్థానిక గుల్మార్ట్ నగర్ లో వేలాది మంది వ్యాపారులు, స్థానికులు బైఠాయించి నిరసనకు దిగారు. చైనా, పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ)లోని కారాకోరమ్ జాతీయ రహదారిని వ్యాపారులు మూడు రోజులుగా దిగ్బంధించారు. వ్యాపారులకు తోడుగా హూంజా, సమీప పట్టణాల నుంచి విద్యావేత్తలు, పౌర సంఘాల ప్రతినిధులు తరలివచ్చి ఆందోళనలో పాల్గొంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com