Rahul Gandhi : హరియాణా ఫలితాలపై రివ్యూ చేస్తున్నాం.. రాహుల్ ట్వీట్ వైరల్

హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు చేస్తూ బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. హర్యానాలో ఖచ్చితంగా గెలుస్తామని భావించిన ఫలితాలను చూసి షాకైంది. ఈ క్రమంలో ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. తాజాగా హర్యానాలో ఓటమిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ అనూహ్య ఫలితాలను తాము విశ్లేషిస్తున్నామని ఎక్స్లో పోస్ట్ చేశారు. చాలా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వాటిని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామన్నారు. హర్యానాలో పార్టీ కోసం నిరంతరం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు రాహుల్ గాంధీ. జమ్మూకశ్మీర్ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. జమ్మూకశ్మీర్లో గెలుపు మన రాజ్యాంగం సాధించిన విజయం.. ప్రజాస్వామ్య ఆత్మగౌరవానికి దక్కిన విజయమన్నారు. ప్రజల హక్కులు, సామాజిక, ఆర్థికన్యాయం, నిజం కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ప్రజల గళాన్ని తాము వినిపిస్తూనే ఉంటామని రాహుల్ గాంధీ రాసుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com